తండ్రీకొడుకులపై కేసు | cheating case on father, son | Sakshi
Sakshi News home page

తండ్రీకొడుకులపై కేసు

Jul 20 2016 10:43 PM | Updated on Aug 16 2018 4:30 PM

మండలంలోని అయ్యగారిపల్లికి చెందిన దూదిమెట్ల లింగన్న, వెంకన్నపై చీటింగ్‌ కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. అయ్యగారిపల్లికి చెందిన తండ్రీకొడుకులు దూదిమెట్ల వెంకన్న, లింగన్న మహబూబాబాద్‌కు చెందిన బోడికి మూడు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మారు.

కురవి : మండలంలోని అయ్యగారిపల్లికి చెందిన దూదిమెట్ల లింగన్న, వెంకన్నపై చీటింగ్‌ కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. అయ్యగారిపల్లికి చెందిన తండ్రీకొడుకులు దూదిమెట్ల వెంకన్న, లింగన్న మహబూబాబాద్‌కు చెందిన బోడికి మూడు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మారు. అయితే, సర్వేనంబర్‌ తప్పుగా చూపించి భూమి అమ్మినట్లు ఫిర్యాదు అందడంతో బుధవారం వారిపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement