‘చంద్రబాబుకు మతిమరుపు జబ్బు వచ్చింది’ | Chandrababu naidu suffers from Alzheimer, says congress leaders raghuveera, KVP Ramachandra Rao | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబుకు మతిమరుపు జబ్బు వచ్చింది’

Sep 28 2016 4:32 PM | Updated on Mar 23 2019 9:10 PM

‘చంద్రబాబుకు మతిమరుపు జబ్బు వచ్చింది’ - Sakshi

‘చంద్రబాబుకు మతిమరుపు జబ్బు వచ్చింది’

పంచుకుని తినడానికే ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ కోసం టీడీపీ, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ నేతలు రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు అన్నారు.

తిరుపతి : పంచుకుని తినడానికే ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ కోసం టీడీపీ, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ నేతలు రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు అన్నారు. ప్రజా బ్యాలెట్ కార్యక్రమంలో భాగంగా బుధవారమిక్కడ మాట్లాడుతూ... ప్యాకేజీ వల్ల మంత్రులు, నారా లోకేవ్ వేలకోట్లు అక్రమంగా ఆర్జించడానికి కుట్ర జరిగిందన్నారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా టీడీపీ, బీజేపీ అడ్డుకున్నాయని వారు విమర్శించారు. చంద్రబాబుకు మతిమరుపు జబ్బు వచ్చిందని, ఇందుకే రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను మర్చిపోయారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్ట్ను కేంద్రం నిర్మించాల్సి ఉన్నా, కేవలం కమీషన్ల కోసమే చంద్రబాబు సర్కార్ స్వీకరించిందని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement