► పెట్టుబడి నిధిని గ్రూపు సభ్యులు వ్యక్తిగత అవసరాలకు వాడుకోవచ్చు
►డీఆర్డీఏ పీడీ ఎం.ఎస్.మురళి
ఒంగోలు సెంట్రల్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గ్రూపు సభ్యుల, ఇతర లావాదేవీలన్నీ నగదు రహితంగానే జరగాలని డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ ఎంఎస్.మురళి అన్నారు. స్థానిక టెక్నికల్ అండ్ ట్రైనింగ్ డెవలప్మెంట్ సెంటర్లో గురువారం ఇంటర్నెట్ సాధీలకు, గ్రామ సంఘాలకు నగదు రహిత లావాదేవీలపై ఒకరోజు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ గ్రూపు సభ్యులు తమ రోజువారీ కార్యకలాపాలకు మొబైల్ బ్యాకింగ్, నెట్ బ్యాంకింగ్, రూపే డెబిట్ కార్డు స్వైపింగ్ ద్వారా లావాదేవీలు నిర్వహించాలన్నారు. గ్రూపు బ్యాంకు ఖాతాలో ఉన్న పెట్టుబడి నిధిని సభ్యులు తమ వ్యక్తిగత బ్యాంకు ఖాతాలోకి మార్చుకుని వాడుకోవచ్చన్నారు. అరుుతే మళ్లీ తిరిగి ఖాతాకు నగదు జమచేయాలని చెప్పారు. గ్రూపుల్లో రూ.30 వేల వరకు జమరుు ఉంటాయన్నారు.
ఒక్కొక్కరూ రూ.3 వేల వరకు నగదును తమ వ్యక్తిగత ఖాతాలోకి బదిలీ చేసుకుని వాడుకోవచ్చని తెలిపారు. జన్ధన్ బ్యాంకు ఖాతాల వినియోగదారులకు రూపే డెబిట్ కార్డులను అందజేశారన్నారు. రూపే డెబిట్కార్డు ద్వారా కూడా తమ నగదు లావాదేవీలు నిర్వహించుకోవాలన్నారు. వచ్చే నెల 1వ తేదీ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా పంపిణీ చేసే పెన్షన్ కూడా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారని చెప్పారు. శిక్షణ కార్యక్రమంలో డ్వామా పీడీ ఎన్.పోలప్ప, జిల్లా లీడ్బ్యాంకు మేనేజర్ నరశింహారావు, జెడ్పీ సీఈవో బాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నగదు రహితంగా లావాదేవీలు
Published Fri, Nov 25 2016 3:31 AM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
తప్పక చదవండి
- పెదపారుపూడి టు ఫిలింసిటీ
- కవ్వింపులు.. ఆపై గొడవలు
- ఆ పదవి నుంచి ఆదిత్యనాథ్ దాస్ను తొలగించండి
- చెల్లిని కాపాడబోయి నీట మునిగిన అక్క మృతి
- ఉబ్బసం రోగులకోసం చేప ప్రసాదం
- మావోయిస్టుల ఏరివేతకు ‘జల్శక్తి’
- T20 World Cup 2024: నిప్పులు చెరిగిన సౌతాఫ్రికా పేసర్లు
- పెరగనున్న ఫర్నిచర్ ధరలు.. కారణం ఇదే..
- ఎర్త్ రైజ్ ఫోటోతో ప్రపంచాన్నే మార్చేసిన నాసా ఆస్ట్రోనాట్ దుర్మరణం
- పెళ్లి చేసుకున్న 45 ఏళ్ల కమెడియన్.. వీడియో వైరల్
Advertisement