నాగార్జునసాగర్ పడవ ప్రమాదం: ప్రయాణికులు సురక్షితం | boat sunk in nagarjuna sagar reservoir | Sakshi
Sakshi News home page

నాగార్జునసాగర్ పడవ ప్రమాదం: ప్రయాణికులు సురక్షితం

Jul 14 2016 9:44 PM | Updated on Apr 3 2019 5:24 PM

నాగార్జునసాగర్ రిజర్వాయర్లో జరిగిన పడవ ప్రమాద ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.

గుంటూరు: నాగార్జునసాగర్ రిజర్వాయర్లో జరిగిన పడవ ప్రమాద ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. వారంతా ఒడ్డుకు చేరుకునే క్రమంలో పడవ రాయిని ఢీకొట్టింది. దీంతో పడవ బోల్తా పడింది. దాంతో తోటి ప్రయాణికులు వెంటనే స్పందించి నదిలో పడ్డ ప్రయాణికులను కాపాడి ఒడ్డుకు చేర్చారు. అయితే అప్పటికే పలువురు ఆరు పడవల్లో ఒడ్డుకు చేరుకున్నారు. శుక్రవారం ఏకాదశి సందర్భంగా పాలం స్వామి ఆలయానికి భక్తులంతా పడవలో బయలుదేరారు. వెల్దుర్తి మండలం శిరిగిరిపాడు మెట్టమీద పల్లికి చెందిన సుమారు 40 మంది భక్తులు ఈ బోటుల్లో ఉన్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement