ప్రభుత్వ హాస్టళ్లకు నాణ్యమైన బియ్యాన్ని అందించేందుకు ఏడాదికి రూ. 80 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్బాబు తెలిపారు.
తిరుపతి : ప్రభుత్వ హాస్టళ్లకు నాణ్యమైన బియ్యాన్ని అందించేందుకు ఏడాదికి రూ. 80 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్బాబు తెలిపారు. శనివారం తిరుపతి ఆర్సీ రోడ్డులోని బాలిక హాస్టల్లో రావెల తనిఖీలు నిర్వహించారు. అనంతరం రావెల మాట్లాడుతూ.... హాస్టళ్లలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.