ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానుంది.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కేబినెట్.. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలోని పేదలకు ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ, నూత ఇసుక పాలసీపై చర్చించనున్నారు. అలాగే సీఆర్డీఏ, అగ్రికల్చర్ జోన్ వివాదం, రాజధాని మాస్టర్ ప్లాన్, గ్రామకంఠాల సమస్య, విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.