మంత్రి ఈటల రాజేందర్ కాన్వాయ్లో ఉన్న టీఆర్ఎస్ నాయకుల కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయడానికి మంత్రి బుధవారం ఉదయం బయలు దేరారు.
మంత్రి కాన్వాయ్లోని వాహనాలు ఢీ
Aug 3 2016 10:01 PM | Updated on Aug 30 2019 8:37 PM
మెట్పల్లి : మంత్రి ఈటల రాజేందర్ కాన్వాయ్లో ఉన్న టీఆర్ఎస్ నాయకుల కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయడానికి మంత్రి బుధవారం ఉదయం బయలు దేరారు. కాన్వాయ్ మెట్పల్లికి చేరుకోగానే అందులోని ఒక డ్రైవర్ ఆకస్మాత్తుగా బ్రేక్ వేసి వాహనాన్ని ఆపాడు. దీంతో దాని వెనుక ఉన్న నాలుగు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ సంఘటనలో కార్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వాహనాల్లో ఉన్న నాయకులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.
Advertisement
Advertisement