ట్రాక్టర్ బోల్తా...20 మందికి గాయాలు | 20 injuried after tractor turns turtle in krishna district | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ బోల్తా...20 మందికి గాయాలు

Dec 10 2016 10:37 AM | Updated on Sep 4 2017 10:23 PM

కృష్ణా జిల్లా పామర్రు మండలం కొరిమెర్ల వద్ద శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో సుమారు 20 మంది గాయాలపాలయ్యారు.

పామర్రు(కృష్ణా): కృష్ణా జిల్లా పామర్రు మండలం కొరిమెర్ల వద్ద శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో సుమారు 20 మంది గాయాలపాలయ్యారు. ఘంటసాల మండలం మల్లంపల్లికి చెందిన ఒక పెళ్లి బృందం ట్రాక్టర్‌లో వేమవరంలోని కొండాలమ్మగుడి నుంచి ట్రాక్టర్‌లో బయలుదేరింది.

వారి వాహనం కొరిమెర్ల వద్ద మలుపులో ట్రాక్టర్ లింకు ఊడిపోవటంతో ట్రక్కు బోల్తాపడింది. ఈ ఘటనలో ట్రక్కులోని 20 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా మారటంతో విజయవాడలోని ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement