రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి | 2 killed in road accident at nellore district | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

Apr 30 2016 8:59 AM | Updated on Aug 30 2018 4:07 PM

ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు.

కావలి: ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలం మద్దూరు పాడు సమీపంలో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన కొందరు కారులో తిరుమల వెళ్తున్నారు. వారి వాహనం మద్దూరుపాడు సమీపంలో రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న వెంకటసాయి, వెంకటేశ్వరరావు అనే ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. వారిని నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement