విద్యుదాఘాతంతో అన్నదమ్ముల మృతి | 2 died due sti current shock in vishaka district | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో అన్నదమ్ముల మృతి

Oct 30 2015 11:56 AM | Updated on Sep 19 2019 2:50 PM

విశాఖ నగరంలోని యలమంచిలి తులసీనగర్‌లో విషాదం చోటు చేసుకుంది.

యలమంచిలి: విశాఖ నగరంలోని యలమంచిలి తులసీనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. భవన నిర్మాణ పనుల్లో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృతి చెందారు. ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులైన బుద్ధా బాబునాయుడు, సత్యనారాయణ భూలోకమాంబ ఆలయం సమీపంలో నూతనంగా ఇల్లు నిర్మించుకుంటున్నారు. శుక్రవారం పనులు జరుగుతుండగా ఇనుపరాడ్లకు 11కేవీ విద్యుత్ తీగలు తగలడంతో షాక్ తగిలి బాబునాయుడు, సత్యనారాయణ అక్కడే ప్రాణాలు విడిచారు. మరో కార్మికుడికి తీవ్ర గాయలయ్యాయి. గాయపడిన కార్మికుడిని యలమంచిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement