15 తులాల బంగారు నగల చోరీ | 150 grams gold theft | Sakshi
Sakshi News home page

15 తులాల బంగారు నగల చోరీ

Feb 3 2017 11:53 PM | Updated on Sep 5 2017 2:49 AM

ఆర్టీసీ బస్సులో ప్రయాణికురాలి పర్సులోని 15 తులాల బంగారు నగలు చోరీ అయ్యాయి.

అనంతపురం సెంట్రల్‌ : ఆర్టీసీ బస్సులో ప్రయాణికురాలి పర్సులోని 15 తులాల బంగారు నగలు చోరీ అయ్యాయి. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం బాగేపల్లికి చెందిన రుక్ష్మిణమ్మ అనంతపురంలోని వేణుగోపాల్‌నగర్‌లో నివాసముంటున్న బంధువుల ఇంటికి వచ్చేందుకు జనవరి 31న ఆర్టీసీ బస్సులో వచ్చింది. అనంతపురం బస్టాండులో బస్సు దిగే సమయంలో పర్సులోని బంగారు నగలను ఎవరో అపహరించారు. బాధితురాలు శుక్రవారం త్రీటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ వెంకటేశులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement