పిడుగుపాటుకు ఒకరి మృతి | 1 killed due to Thunderbolt | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు ఒకరి మృతి

Jun 11 2016 6:49 PM | Updated on Sep 4 2017 2:15 AM

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం దేశాయిపల్లి గ్రామంలో పిడుగుపాటుకు గురై ఓ వ్యక్తి మృతి చెందాడు.

దుగ్గొండి: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం దేశాయిపల్లి గ్రామంలో పిడుగుపాటుకు గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన ఐలయ్య(45) గ్రామ శివారులో గొర్రెలు కాస్తుండగా.. ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. దీంతో తడవకుండా ఉండటానికి చెట్టు నీడకు వెళ్లాడు. అదే సమయంలో పిడుగు పడటంతో ఐలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement