ఓవర్ బ్రిడ్జిపై నుంచి దూకి మహిళ ఆత్మహత్య
కృష్ణాజిల్లా , పొన్నూరు: ఓవర్ బ్రిడ్జిపై నుంచి దూకి మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పొన్నూరు పట్టణంలో మంగళవారం కలకలం రేపింది. పట్టణంలోని 10వ వార్డుకు చెందిన అద్దంకి వీర ప్రసాదరావు కుమార్తె అమదాలపల్లి సునీత(35) నిడుబ్రోలు ఓవర్ బ్రిడ్జిపై నుంచి తుంగభద్ర డ్రెయిన్లో దూకింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే డ్రెయిన్లోకి దిగి ఆమెను బయటకు తీసి నిడుబ్రోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలి సిన పట్టణ సీఐ ఎం.నాగేశ్వరావు, ఎస్ఐ డి.కిషోర్బాబులు ఆస్పత్రికి బాధితురాలిని సందర్శించారు.
ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు పోలీసులు తెలి పారు. మృతిరాలు తండ్రి అద్దంకి వీరప్రసాదరావు మాట్లాడుతూ తన కుమార్తెకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో 2 నెలల క్రి తం అల్లుడు వద్ద నుంచి ´న్నూ రు తీసుకువచ్చి వైద్యం చేయిస్తున్నామని తెలిపారు. రో గం తగ్గకపోవటంతో మనస్తాపానికి గురై ఓవర్ బ్రిడ్జి పై నుంచి దూకి మృతి చెందిం దని ఆయన పోలీసులకు తెలిపారు. వీరప్రసాదరావు ఫిర్యాదు మేరకు ఎస్ఐ డి.కిషోర్బాబు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు.