ఏడు గుంటల భూమి కోసం.. గొడ్డలితో నరికి భర్త హత్య

Wife killed her husband for land issue - Sakshi

తిరుమలాయపాలెం: ఖమ్మం జిల్లా బీరోలులో ఏడు గుంటల భూమి కోసం కట్టుకున్న భర్తనే కొడుకుతో కలసి రెండో భార్య గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేసింది. బుడిగె సీతారాములు(65) సోమలక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు జన్మించాడు. తర్వాత సోమలక్ష్మి మృతి చెందడంతో సత్యవతిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు కూతురు, కొడుకు జన్మించగా.. వారికి పెళ్లిళ్లు కూడా అయ్యాయి.

ఈ క్రమంలో సీతారాములుకు ఉన్న 15 గుంటల భూమిలో వాటా కోసం గొడవలు జరిగాయి. 7 గుంటల భూమిని సత్యవతి పేరిట స్టాంపు పేపర్‌పై రాసి ఇచ్చినప్పటికీ, పట్టా మాత్రం అతని పేరునే ఉంది. దీంతో తన పేరు పట్టా చేయాలని ఆమె పట్టు బట్టడంతో సీతారాములు పట్టించుకోలేదు. దీంతో కక్ష పెంచుకున్న ఆమె.. కొడుకుతో కలసి శుక్రవారం అర్ధరాత్రి సీతారాములును గొడ్డలితో నరికి హత్య చేసింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top