స్నేహితుడి కొడుకునే కిడ్నాప్‌ చేసి.. కిరాతకం!

Two Men killed friedn son for Money - Sakshi

సాక్షి, అనంతపురం : డబ్బు కోసం స్నేహితుడి కొడుకుని కిడ్నాప్‌ చేసి హత్య చేసిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. గౌతమ్(9) అనే బాలుడిని అతని తండ్రి స్నేహితులు సాయి, మల్లిలు డబ్బు కోసం కిడ్నాప్ చేసి.. ఆ తర్వాత భయంతో చంపేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆ తర్వాత బాలుడి మృతదేహాన్ని బి.యాలేరు చెరువులో పడేశారు. పోలీసులు ఎట్టకేలకు నిందితులు సాయి, మల్లిలను అరెస్టు చేశారు. బాలుడి హత్యతో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ​కు న్యాయం జరిగేలా చూడాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని గౌతమ్‌ తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top