నిర్మాణంలో ఉన్న వాటర్‌ ట్యాంక్‌ కూలి ముగ్గురి మృతి | Three dead after under-construction water tank collapses in Bengaluru | Sakshi
Sakshi News home page

నిర్మాణంలో ఉన్న వాటర్‌ ట్యాంక్‌ కూలి ముగ్గురి మృతి

Jun 17 2019 4:36 PM | Updated on Jun 17 2019 4:50 PM

Three dead after under-construction water tank collapses in Bengaluru - Sakshi

సాక్షి, బెంగళూరు : నిర్మాణంలో ఉన్న వాటర్‌ ట్యాంక్‌ కూలి ముగ్గురు దుర్మరణం చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ సంఘటన ఉత్తర కర్ణాటకలోని జోగప్ప లేఅవుట్‌లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ...కూలీలు నిర్మాణపు పనుల్లో ఉండగా వాటర్‌ ట్యాంక్‌ ఫిల్లర్‌ హఠాత్తుగా కూలినట్లు తెలిపారు. గాయపడినవారి పరిస్థితి విషమంగా ఉందని, వారిని సమీప ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌టీ బృందం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. కర్ణాటక మంత్రి కృష్ణ బైరీ గౌడ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement