హోటల్‌ గదిలో యువకుడు ఆత్మహత్య | student suicide in hotel room | Sakshi
Sakshi News home page

హోటల్‌ గదిలో యువకుడు ఆత్మహత్య

Jan 21 2018 8:15 PM | Updated on Nov 9 2018 4:36 PM

సాక్షి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మోతుకూరి సాయి వెంకట వంశీ కృష్ణ అనే యువకుడు స్థానిక సీఆర్‌ రెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజీలో సీఎస్‌ఈ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇక్కడి ఓ హోటల్ గదిలో ఆదివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన హోటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. త్రీ టౌన్ పోలీసులు హోటల్‌కు చేరుకుని మృతుడి వివరాలు సేకరిస్తున్నారు. మృతుడిని గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందినవాడిగా గుర్తించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement