తాబేళ్ల అక్రమ రవాణా | Smuggling Of Turtles | Sakshi
Sakshi News home page

తాబేళ్ల అక్రమ రవాణా

Aug 24 2018 12:57 PM | Updated on Aug 24 2018 12:57 PM

Smuggling Of Turtles - Sakshi

  స్వాధీనం చేసుకున్న తాబేళ్లు 

భువనేశ్వర్‌ : రాష్ట్రం సరిహద్దులో తాబేళ్ల అక్రమ రవా ణా గుట్టు రట్టయింది.  చాందీపూర్‌ అటవీ శాఖ పోలీసులు, బాలాసోర్‌ రైల్వే రక్షక దళం ఉమ్మడి ప్రయత్నంతో ఈ గుట్టు రట్టయింది. పొరుగు రాష్ట్రం పశ్చిమ బెంగాల్‌కు ఈ తాబేళ్లను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అందిన సమాచారం ఆధారంగా ఈ రెండు వర్గాలు ఆకస్మికంగా దాడి చేశా యి. రాజ్‌ఘాట్‌ రైల్వేస్టేషన్‌లో ఆకస్మికంగా దాడి చేపట్టారు.

ఈ దాడిలో 4 జాతుల 91 తాబేలు పిల్లల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనలో ఇద్దరు నిందితుల్ని అరెస్ట్‌  చేశారు. ఇద్దరు వ్యక్తుల సందిగ్ధ కదలిక నేపథ్యంలో రైల్వే రక్షక దళం ఈ వర్గంపై దృష్టి సారించింది. పోలీసు దళాలు అరెస్ట్‌ చేసిన ఇద్దరు నిందితుల్లో ఒకరిని పశ్చిమ బెంగాల్‌లోని బాలాసోర్‌ జిల్లా బొగొరాయి ప్రాంతీయుడుగా గుర్తించారు.

వీరిద్దరూ తరచూ ఇటువంటి అక్ర మ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచా రం అందినట్లు చాందీపూర్‌ అటవీ శాఖ పోలీసు లు తెలిపాయి. స్వాధీనం చేసుకున్న 91 తాబేలు పిల్లల్ని సువర్ణరేఖ, సముద్ర సంగమం కేంద్రంలో విడిచి పెట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement