గుంటూరు ఈస్ట్: నిరుపేద కుటుంబాలకు చెందిన మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుని లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులు 10 రోజుల క్రితం ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తండ్రి హైదరాబాద్లో ఉండటం, నిందితులను కాపాడేందుకు ఓ పెద్ద మనిషి మభ్యపెట్టిన కారణంగా బాలిక తల్లిదండ్రులు ఆలస్యంగా పోలీసులను ఆశ్రయించినట్టు తెలిసింది. గుంటూరు లాలాపేట పోలీస్స్టేషన్ పరిధిలో ఓ కాలనీకి చెందిన 8వ తరగతి చదివే 13 సంవత్సరాల బాలిక జనవరి 28వ తేదీ రాత్రి 7 గంటల సమయంలో ఇంటికి సమీపంలోని చిల్లర కొట్టుకు వెళ్లింది. బాలికకు పరిచయస్తుడైన 23 ఏళ్ల వ్యక్తి ఆటోలో వచ్చి ఐస్క్రీమ్ పార్లర్కు వెళదామంటూ బాలికను ఆటో ఎక్కమన్నాడు.
బాలిక నిరాకరించడంతో చేయి పట్టుకుని బలవంతంగా ఆటో ఎక్కించాడు. అతను తెలిసిన వ్యక్తి అవడంతో కొంతసేపు బాలిక ప్రతిఘటించలేదు. అయితే ఆటో కొంత దూరం వెళ్లిన తర్వాత మరో ముగ్గురు ఎక్కారు. ఆటోను బాలికకు తెలియని ప్రాంతాల వైపునకు తీసుకెళ్తుండటంతో ఆమె ప్రతిఘటించింది. దీంతో ఆటోను నగరంపాలెంలో పాడుబడ్డ స్థితిలో ఉన్న పోలీస్ క్వార్టర్స్లోకి తీసుకెళ్లి అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అక్కడి నుంచి సంపత్నగర్ కొబ్బరి తోటల్లోకి తీసుకెళ్లి రెండోసారి లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితులు బాలికను తీవ్రంగా కొట్టి ఆమె పట్ల నీచంగా ప్రవర్తించారు. రాత్రి 12 గంటల సమయంలో బాలికను ఆర్టీసీ బస్టాండు సమీపంలో వదిలిపెట్టి వెళ్లిపోయారు.
నిందితులు బాలిక బంధువులకు ఫోన్ చేసి బస్టాండ్ సమీపంలో ఆమె ఒంటరిగా కనిపించినట్లు చెప్పారు. బాలిక తండ్రి ఊళ్లో లేని కారణంగా బంధువులు ఆమెను ఇంటికి చేర్చారు. 4 రోజుల అనంతరం తండ్రి ఇంటికి చేరుకుని బాలికను విచారించగా నిందితుల దుర్మార్గం బయటపడింది. అయితే స్థానిక పెద్ద ఒకరు బాలిక తల్లిదండ్రులను సంప్రదించి పోలీస్ స్టేషన్కు వెళ్తే పరువు పోతుందని పోలీసులే ఇక్కడకు వచ్చి చర్యలు తీసుకునేలా తాను ప్రయత్నిస్తానని నమ్మించాడు. అయితే ఆ పెద్ద మనిషి నిందితుల తరఫునే వ్యవహరిస్తున్నాడని గుర్తించి బాలిక తండ్రి శుక్రవారం పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు నిర్భయ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు సమాచారం. నిందితులు గతంలోనూ ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక దాడి చేసి పెద్దల పంచాయితీతో బయటపడ్డట్లు స్థానికులు చెబుతున్నారు.
బాలికపై సామూహిక లైంగికదాడి
Published Sat, Feb 10 2018 7:08 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
IPL 2024: సన్రైజర్స్, లక్నో మ్యాచ్.. లంక యువ స్పిన్నర్ అరంగేట్రం
ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
IPL 2024 SRH VS LSG: మరో మూడేస్తే..!
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement