అప్పుడే పుట్టిన కొడుకును చూసేందుకు వెళ్తూ.. అంతలోనే! | Road accident in kurnool | Sakshi
Sakshi News home page

Feb 26 2018 12:02 PM | Updated on Aug 30 2018 4:20 PM

Road accident in kurnool - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కర్నూల్ : జిల్లాలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన కన్న కొడుకును చూసేందుకు ఎంతో ఆతృతతో సంతోషంతో బయలుదేరిన ఓ వ్యక్తి.. అంతలోనే కడతేరాడు. రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. కర్నూల్‌లోని శ్రీరామ థియేటర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

సీబెలగల్ మండలం కొండాపురానికి చెందిన సుధాకర్ భార్య కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. భార్య, బిడ్డను చూసేందుకు బైక్‌ మీద సుధాకర్‌ బయలుదేరాడు.  శ్రీరామ థియేటర్ ఎదుట అతని బైకును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో భార్య, అప్పుడు పుట్టిన కొడుకును చూడకుండానే సుధాకర్‌ ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన చూసి స్థానికులు కంటతడి పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement