మందు కోసం ఓ యువకుడి దుశ్యర్య.. | Person Set Fire to House, Escape in Chennai  | Sakshi
Sakshi News home page

తాగడానికి డబ్బులు ఇవ్వలేదని యువకుడి దుశ్చర్య..

Mar 1 2018 8:03 AM | Updated on Aug 21 2018 6:02 PM

Person Set Fire to House, Escape in Chennai  - Sakshi

దగ్ధమైన ఇంటి పైకప్పు

సాక్షి, అన్నానగర్‌: మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన ఓ యువకుడు బంధువుల ఇంటికి నిప్పుపెట్టాడు. ఈ ఘటన చెన్నైలోని కుమారపురం సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. మంటలు పెట్టిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. తక్కలై సమీపం కుమారపురం, శాంతమ్మ(70) భర్త మృతిచెందడంతో తక్కలై సమీపం కుమారపురం ఒంటరిగా నివశిస్తోంది. ఈమె బంధువుల కుమారుడు రఘు(33) . అతను కార్మికుడిగా పనిచేస్తున్నాడు.

ఇతను శాంతమ్మ ఇంటి సమీపంలో నివసిస్తున్నాడు. రఘుకి మద్యం సేవించే అలవాటు ఉంది. తరచూ శాంతమ్మ దగ్గర మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలని వేధించేవాడు. ఎప్పటిలాగే మంగళవారం రఘు మద్యం సేవించడానికి నగదు అడిగాడు. ఇందుకు శాంతమ్మ అంగీకరించలేదు. ఆవేశంతో రఘు శాంతమ్మ ఇంటికి మంటలు అంటించి పరారయ్యాడు. గమినించిన స్థానికులు వెంటనే మంటలను ఆర్పారు. అంతలోనే ఇంటి పైకప్పు మొత్తం కాలి బూడిదైంది. కొట్రికాడు పోలీసులు కేసు నమోదు చేసి రఘుని అరెస్టు చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement