లాక్‌డౌన్‌: పోలీసును ఈడ్చుకెళ్లిన బైకర్‌

Motorcyclist Drags Mumbai Police For 50 Metres During Covid 19 Lockdown - Sakshi

ముంబై: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌(కోవిడ్‌-19) లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న తరుణంలో రోడ్డుపైకి వచ్చిన ఓ వ్యక్తి పోలీసు పట్ల దురుసుగా ప్రవర్తించాడు. తనను ఆపేందుకు ప్రయత్నించిన సదరు అధికారిని బైకుతో ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటన దక్షిణ ముంబైలో చోటుచేసుకుంది. ఖాజాబీ షేక్‌ నయీమ్‌(42) అనే వ్యక్తి గురువారం వాడిబండర్‌ గుండా బైక్‌ వెళ్తున్నాడు. ఈ క్రమంలో అతడి ప్రవర్తనపై అనుమానం కలిగడంతో ఏఎస్‌ఐ విజేంద్ర ధూరత్‌ బండి ఆపాల్సిందిగా సూచించాడు. (కరోనా వైరస్‌ ; నటుడిపై దాడి)

ఇక అప్పటికే వేగంగా వెళ్తున్న నయీమ్‌.. బైకును ఆపకుండా విజేంద్రను 50 మీటర్ల వరకు లాక్కెళ్లాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ క్రమంలో నయీంను వెంబడించిన పోలీసులు.. అతడిని అరెస్టు చేశారు. సెక్షన్‌ 353(ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కల్గించడం లేదా గాయపరచడం) కింద కేసు నమోదు చేశారు. ఏఎస్‌ఐ విజేంద్రను ఆస్పత్రిలో చేర్పించామని.. అతడి ఆరోగ్యం బాగుందని తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top