ఆర్థిక ఇబ్బందులతో తల్లీకూతురు.. | Mother And Daughter Commits Suicide In Guntur | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బందులతో తల్లీకూతురు ఆత్మహత్యాయత్నం

May 11 2018 6:19 AM | Updated on Aug 24 2018 2:33 PM

Mother And Daughter Commits Suicide In Guntur - Sakshi

గుంటూరు ఈస్ట్‌: ఆర్థిక ఇబ్బందులు తాళలేక తల్లి, కుమార్తెలు ఆత్మహత్యాయత్నం చేశారు. తల్లి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా పాత గుంటూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... పాత గుంటూరు పరిధిలోని బూరెల వారి వీధిలో పోలీశెట్టి సాంబశివరావు భార్య నిర్మలా (52), ఆమె రెండో కుమార్తె వద్ద నివాసం ఉంటున్నారు. ఐదు సంవత్సరాల కిందట సాంబశివరావు మృతి చెందారు. నిర్మల పెద్ద కుమార్తెకు వివాహం జరిపించి అత్తవారింటికి పంపించింది.

రెండో కుమార్తె సువర్చలను ఎంబీఏ చదివించింది. వివాహ ప్రయత్నాలు చేసింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వివాహం చేయలేకపోయింది. కొంత అప్పులు అయ్యాయి. దీంతో తల్లీ కుమార్తెలు ఇద్దరు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. గురువారం ఇరువురు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. స్థానికులు గమనించి  నగరంలోని ఓప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నిర్మల మృతి చెందింది. కుమార్తె సువర్చలకు చికిత్స చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement