యువకుడి దారుణ హత్య

Man Murdered In K Bitragunta Prakasam - Sakshi

సాక్షి, కె.బిట్రగుంట (ప్రకాశం): మతిస్థిమితం లేని యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన సోమవారం తెల్లవారు జామున జరుగుమల్లి మండలం కె.బిట్రగుంట సమీపంలోని పాలేరు బ్రిడ్జి కింద వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. కనిగిరి మండలం లింగారెడ్డిపల్లెకు చెందిన పత్తి ప్రసాద్‌రెడ్డి (38)కి చాలా కాలంగా మతిస్థిమితం సక్రమంగా లేదు. వ్యవసాయం చేసుకుంటున్న తన అన్న వద్దే ఉంటున్నాడు. ప్రసాద్‌రెడ్డికి వివాహం చేసినా భార్య అతడిని వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆదివారం ఒంగోలు ఆస్పత్రికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.

ఇలా శవమై ఉండటంతో అతని అన్న, బంధువులు విలపించారు. వాస్తవానికి కనిగిరి నుంచి ఒంగోలుకు బస్సు మార్గం అనుకూలంగా ఉంటుంది. అటువంటిది కనిగిరి నుంచి ఒంగోలు వెళ్లకుండా ఈ మార్గంలోకి ఎందుకు వచ్చాడో.. అది కూడా పాలేరు బ్రిడ్జి కింద ఎలా హత్యకు గురయ్యాడో పోలీసులకు మిస్టరీగా మారింది. సంఘటన స్థలాన్ని ఒంగోలు డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్‌ పరిశీలించారు. కేసును ఇన్‌చార్జి  ఒంగోలు రూరల్‌ సీఐ సుబ్బారావు విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ కమలాకర్‌ వివరించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top