హైదరాబాద్‌లో వ్యక్తి దారుణ హత్య

Man Murdered In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని పాతబస్తీలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. ఘాన్సీబజార్ డివిజన్‌కు చెందిన రవి అలియాస్‌ పీటర్‌ రవిని ముగ్గురు దుండగులు నడిరోడ్డుపై నరికి చంపారు. ఈ ఘటన చార్మినార్‌ పరిధిలోని భగ్వాన్‌ దేవి ఆసుపత్రి పరిధిలో చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగిన ఈ దారుణ హత్యా దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పాతకక్షలే ఈ హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top