ఆక్సిజన్ అందక అంబులెన్స్‌లోనే.. | Man dies In Ambulance Lack Of oxygen In Saharanpur | Sakshi
Sakshi News home page

ఆక్సిజన్ అందక అంబులెన్స్‌లోనే..

Mar 24 2018 6:46 PM | Updated on Aug 18 2018 2:15 PM

Man dies In Ambulance Lack Of oxygen In Saharanpur - Sakshi

అంబులెన్స్

సాక్షి, లక్నో: రాష్ట్ర ప్రభుత్వం, వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం పోయింది. ప్రాణాలు రక్షించేందుకు తరలిస్తున్న అంబులెన్స్ లోనే వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం బాధితుడి కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ ఘటన యూపీలోని సహరన్‌పూర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. దీనిపై సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఓ వ్యక్తి తీవ్ర అస్వస్థతకు లోను కావడంతో ఓ ఆస్పత్రికి ఫోన్ చేశారు. వైద్యులు ఆక్సిజన్ సిలిండర్ లేకుండానే పేషెంట్‌ను హాస్పిటల్‌కు తీసుకొచ్చేందుకు అంబులెన్స్ ను పంపించారు. అయితే ఆసుపత్రికి తీసుకొస్తుండగా మార్గం మధ్యలోనే ఆ పేషెంట్ (45) చనిపోయాడు.

ఆక్సిజన్ సిలిండర్ పంపకపోవడం వల్లే ప్రాణాలు పోయాయంటూ మృతుడి బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. హాస్పిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ బీఎస్ మాట్లాడుతూ.. ఆక్సిజన్ సిలిండర్ పంపామని తమపై తప్పుడు ఆరోపణలు చేస్తారని, విచారణలో అన్నీ తెలుతాయన్నారు. ఆక్సిజన్ లేని సిలిండర్లే అంబులెన్స్ లో ఉంటున్నాయని డ్రైవర్ తెలిపాడు. హాస్పిటల్‌కు కాసేపట్లో అంబులెన్స్ చేరుకుంటుందనగా ఆక్సిజన్ అయిపోయందని మెడికల్ టెక్నీషియన్ చెప్పాడు.

యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చిన తర్వాత యూపీలోని పలు ఆస్పత్రల్లో ఆక్సిజన్ సిలిండర్ల కొరతతో నెలల చిన్నారులు వేలల్లో మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement