విద్యుదాఘాతంతో యువకుడి మృతి | Man died by electric shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

Aug 29 2018 1:26 PM | Updated on Sep 5 2018 2:26 PM

Man died by electric shock  - Sakshi

భార్గవ్‌ మృతదేహం 

మేళ్లచెరువు (హుజూర్‌నగర్‌) నల్గోండ : విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో విద్యుదాఘానికి గురై యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం మండలంలోని రేవూరు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొర్రా భార్గవ్‌ (25) గ్రామంలో ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రేవూరు పరిధిలోని పొలాల్లో విద్యుత్‌ వైరు తెగిపడి ఉందని రైతులు స్థానిక లైన్‌మన్‌కు తెలపగా అతను భార్గవ్‌ను వైరు జాయింట్‌ ఇవ్వమని పంపంచాడు.

అక్కడకు వెళ్లిన భార్గవ్‌ విద్యుత్‌ సప్లయ్‌ నిలిపివేశారని భావించి భార్గవ్‌ విద్యుత్‌ వైరు పట్టుకోగా విద్యుత్‌షాక్‌తో అక్కడికక్కడే మృతిచెందాడు. విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం నిండుప్రాణాన్ని బలిగొందని గ్రామస్తులు గొడవకు దిగారు. భార్గవ్‌ నెలరోజుల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్య సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ.సత్యనారాయణగౌడ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement