పుట్టిన రోజు నాడే కానరాని లోకాలకు..   

Man died by electric shock  - Sakshi

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

కోదాడ పట్టణంలో ఘటన

కోదాడఅర్బన్‌ : పుట్టినరోజు కావడంతో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకునేందుకు బయటకు వెళ్లిన ఓ యువకుడు కానరాని లోకాలకు వెళ్లాడు. కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్‌రోడ్డు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ సమీపంలో బుధవారం రాత్రి విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందాడు. పట్టణ ఏఎస్‌ఐ సైదా తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన గజ్జెల జనార్దన్‌కుమార్‌(20) ఖమ్మం క్రాస్‌రోడ్డులోని హెయిర్‌ సెలూన్‌ దుకాణంలో రెండేళ్లుగా పనిచేస్తున్నాడు.

బుధవారం తన పుట్టినరోజు కావడంతో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకునేందుకు ఖమ్మం క్రాస్‌రోడ్డులోని ఓ పాత గోదాము వద్దకు వచ్చాడు. అందులో పూర్తిగా పాత ఇనుప సామగ్రి ఉండడం, గోదాములోని విద్యుత్‌ వైరు లీకై షెట్టర్‌కు విద్యుత్‌ ప్రసారం అవుతుంది. ఈ క్రమంలో మూత్రవిసర్జన కోసం బయటకు వెళ్లేందుకు జనార్దన్‌కుమార్‌ షట్టర్‌ ఎత్తిన సమయంలో విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడిక్కడే మరణించాడు. సంఘటనపై జనార్ధనకుమార్‌ తండ్రి ఏడుకొండలు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top