భార్యపై భర్త హత్యాయత్నం  | Husband assassination on his wife | Sakshi
Sakshi News home page

భార్యపై భర్త హత్యాయత్నం 

Apr 12 2018 2:58 AM | Updated on Jul 27 2018 2:26 PM

Husband assassination on his wife - Sakshi

కత్తిపోట్లకు గురైన కన్యాకుమారి

మక్తల్‌: పాఠశాలలో ఓ ఉపాధ్యాయురాలిపై ఆమె భర్త కత్తితో పొడిచి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌ మండలం దాదన్‌పల్లికి చెందిన కన్యాకుమారి (35), ఏపీలోని కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం సాతన్‌కోటకు చెందిన రమణారెడ్డి భార్యాభర్తలు. కాగా, కన్యాకుమారి మక్తల్‌ మండలం ముస్లాయిపల్లి ప్రభుత్వ పాఠశాలలో హెచ్‌ఎంగా విధులు నిర్వర్తిస్తోంది. కొన్నేళ్లుగా వీరి నడుమ భేదాభిప్రాయాలు ఉండగా బంధువులు సర్దిచెపుతూ వస్తున్నారు.

అయితే, భార్యకు ఉద్యోగం ఉండగా.. రమణారెడ్డి ఖాళీగా ఉండడంతో తనను చిన్నచూపు చూస్తోందని భావించి బుధవారం ఉదయం తమ పిల్లలు జసిక, అనన్యతో కలసి పాఠశాలకు వచ్చాడు. ఆ తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ ఓ గదిలో మాట్లాడుకుంటుండగా.. కోపోద్రిక్తుడైన రమణారెడ్డి, భార్యను కత్తితో పొడిచాడు. దీంతో ఆమె కేకలు వేయగా మిగతా ఉపాధ్యాయులు రావడంతో రమణారెడ్డి తన చేతిలో ఉన్న కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. తీవ్రంగా గాయపడిన వీరిద్దరిని గ్రామస్తులు ఆస్పత్రికి తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement