-
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..
సాక్షి, ఆత్మకూరు: వ్యక్తి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో కలిసి భార్యే కడతేర్చినట్లు దర్యాప్తులో తేల్చారు. ఈ మేరకు ఇద్దరు నిందితులను ఆదివారం అరెస్ట్ చేసినట్లు ఆత్మకూరు సీఐ వైవీ సోమయ్య తెలిపారు. పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్య కేసు వివరాలను సీఐ వెల్లడించారు. ఆత్మకూరు మండలం దేపూరు ఎస్సీ కాలనీకి చెందిన కటారి వెంకటేశ్వర్లు(37), వెంకట సుబ్బమ్మ దంపతులు. జీవాలను మేపుకొంటూ జీవనం సాగిస్తున్నారు. వెంకట సుబ్బమ్మ తన సమీప బంధువైన కొలకాని పెంచలయ్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తుండగా భర్త పలుమార్లు మందలించాడు. అయినా భార్య ప్రవర్తనలో మార్పు రాలేదు. చదవండి : ప్రేయసి మోసం, ప్రణయ్ ఆత్మహత్య ఈ నేపథ్యంలో ఏడాదిన్నర క్రితం వెంకటసుబ్బమ్మ, పెంచలయ్య గ్రామం విడిచి వెళ్లి ఆత్మకూరులో సహజీవనం సాగించారు. ఇటీవల విడిపోయి తిరిగి ఎవరిళ్లకు వారు చేరుకున్నారు. అయితే తిరిగి మళ్లీ వారిద్దరూ అక్రమ సంబంధం కొనసాగిస్తున్న విషయాన్ని వెంకటేశ్వర్లు గమనించి హెచ్చరించాడు. దీంతో తన అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య కడతేర్చేందుకు ప్రణాళిక వేసింది. ఈ నెల 9న వెంకటేశ్వర్లు జీవాలకు మేత కోసం పొలాల్లోకి వెళుతుండగా గమనించి ప్రియుడితో కలిసి తోట దారి వద్ద తలపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తరువాత ఎలాంటి అనుమానం రాకుండా నిందితులు గ్రామానికి చేరుకున్నారు. ఈ నెల 11న గ్రామస్తులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిజాలు వెలుగు చూడడంతో నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. ఈ సమావేశంలో ఆత్మకూరు ఎస్సైలు ఎం రవినాయక్, సీ సంతోష్కుమార్రెడ్డి పాల్గొన్నారు. చదవండి: భార్య దారుణ హత్య.. భర్త ఏమయ్యాడు..! ఆడుకునేందుకు వెళ్లి.. విద్యుదాఘాతానికి బాలుడి బలి కోట: స్థానిక అరుంధతీయ కాలనీలో దీపావళి పండగ రోజు విషాదం చోటుచేసుకుంది. ఆడుకునేందుకు వెళ్లిన బాలుడు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోవడం అందర్ని కలచి వేసింది. కోట ఇన్చార్జి ఎస్సై భోజ్యానాయక్ వివరాల మేరకు..అరుంధతీయ కాలనీకి చెందిన గోనిపాక కోటమ్మ కుమారుడు కిషోర్(11) తన స్నేహితులతో కలిసి కోటక్రాస్రోడ్డు వద్దకు ఆడుకునేందుకు వెళ్లాడు. అక్కడ హరిహర రైస్మిల్లు సమీపంలో ఎత్తుగా ఉన్న వడ్ల పొట్టు వద్ద ఆడుకుంటున్న సమయంలో 11కేవీ విద్యుత్వైర్లు తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకోగా అప్పటికే బాలుడు విగతజీవిగా పడి ఉన్నాడు. బాలుడి తండ్రి కొన్నేళ్ల క్రితం మరణించగా, తల్లి అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. విద్యుదాఘాతంతో బాలుడు మృతి చెందడంతో ఆమెను ఓదార్చడం ఎవరితరం కాలేదు. ఈ ఘటనతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాలుడి మృతదేహానికి పోలీసులు పోస్టుమార్టం చేయించి కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా బాలుడి బంధువులు ఆగ్రహంతో ప్రమాదానికి కారణమైన హరిహర రైస్మిల్లు వద్ద ఆదివారం మృతదేహంతో ధర్నాకు దిగారు. రైస్మిల్లు యాజమాన్యం 11కేవీ విద్యుత్ వైర్లు తగిలేంత వరకు వడ్ల పొట్టును పోయడం..పొట్టులో విద్యుత్వైర్లు కూరుకుపోయి కనిపించకుండా ఉండడంతో ప్రమాదం జరిగిందన్నారు. రైస్మిల్లు యాజమాన్యం వచ్చి సమాధానం చెప్పే వరకు మృతదేహాన్ని కదిలించేది లేదని పట్టుబట్టారు. దీంతో ఇన్చార్జి ఎస్సై భోజ్యానాయక్ న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వెనుదిరిగారు. మోటార్ వేస్తుండగా.. నెల్లూరు(క్రైమ్): విద్యుత్షాక్తో వ్యక్తి మృతి చెందిన ఘటన సప్తగిరిలేఅవుట్లో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు..సప్తగిరి లేఅవుట్లో పీ బాలంకిరెడ్డి (48), సుజాత దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ నెల 14న ఉదయం సంపులోని వర్షపునీటిని తోడేందుకు బాలంకిరెడ్డి సెల్లార్లోని మోటార్ వేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో బాలంకిరెడ్డి విద్యుదాఘాతానికి గురవగా కుటుంబ సభ్యులు హుటాహుటిన బొల్లినేని(కిమ్స్) ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందారని నిర్ధారించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు వేదాయపాళెం ఎస్సై ఎం పుల్లారెడ్డి కేసు దర్యాప్తు చేçస్తున్నారు. సముద్రంలో మునిగి యువకుడి మృతి ఇందుకూరుపేట: సముద్రంలో మునిగి బెంగళూరుకు చెందిన యువకుడు మృతి చెందిన ఘటన మైపాడు బీచ్లో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు కథనం మేరకు.. కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన రిషిశెట్టి తన కుటుంబ సభ్యులు ఆరుగురితో కలిసి కారులో తీర్థయాత్రలకు బయలుదేరారు. నెల్లూరు జిల్లాలోని పలు ఆలయాలను దర్శించుకున్న వీరు సేదతీరేందుకు మైపాడు బీచ్కు ఆదివారం చేరుకున్నారు. అందరూ కలిసి సముద్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలో రిషిశెట్టి పెద్దకుమారుడు కిరణ్ ఆర్ శెట్టి(21)కు ఈత వచ్చి ఉండడంతో సముద్రంలో కొద్దిగా లోపలకు వెళ్లాడు. సముద్రం కసురు మీద ఉండడంతో అలల తాకిడికి నీటి మునిగి గల్లంతయ్యారు. కొద్దిసేపటి తరువాత విగతజీవిగా ఒడ్డుకు కొట్టుకురావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇందుకూరుపేట ఎస్సై నరేష్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరాతీశారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు తరలించారు. -
భార్యపై భర్త హత్యాయత్నం
మక్తల్: పాఠశాలలో ఓ ఉపాధ్యాయురాలిపై ఆమె భర్త కత్తితో పొడిచి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. మహబూబ్నగర్ జిల్లా మక్తల్ మండలం దాదన్పల్లికి చెందిన కన్యాకుమారి (35), ఏపీలోని కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం సాతన్కోటకు చెందిన రమణారెడ్డి భార్యాభర్తలు. కాగా, కన్యాకుమారి మక్తల్ మండలం ముస్లాయిపల్లి ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎంగా విధులు నిర్వర్తిస్తోంది. కొన్నేళ్లుగా వీరి నడుమ భేదాభిప్రాయాలు ఉండగా బంధువులు సర్దిచెపుతూ వస్తున్నారు. అయితే, భార్యకు ఉద్యోగం ఉండగా.. రమణారెడ్డి ఖాళీగా ఉండడంతో తనను చిన్నచూపు చూస్తోందని భావించి బుధవారం ఉదయం తమ పిల్లలు జసిక, అనన్యతో కలసి పాఠశాలకు వచ్చాడు. ఆ తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ ఓ గదిలో మాట్లాడుకుంటుండగా.. కోపోద్రిక్తుడైన రమణారెడ్డి, భార్యను కత్తితో పొడిచాడు. దీంతో ఆమె కేకలు వేయగా మిగతా ఉపాధ్యాయులు రావడంతో రమణారెడ్డి తన చేతిలో ఉన్న కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. తీవ్రంగా గాయపడిన వీరిద్దరిని గ్రామస్తులు ఆస్పత్రికి తరలించారు. -
భార్యపై భర్త హత్యాయత్నం
తుని రూరల్ : తుని మండలం కొలిమేరులో నిద్రిస్తున్న భార్యపై భర్త హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బుధవారం అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో గ్రామానికి చెందిన శివకోటి ఆనంద్ తన భార్య మరియ గొంతుపై బ్లేడ్తో కోసి హత్యాయత్నం చేశాడు. తీవ్రంగా గాయపడిన మరియను ఆమె సోదరుడు చక్కా అప్పారావు 108 అంబులెన్సులో తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలవరం గ్రామానికి చెందిన ఆనంద్తో మరియకు వివాహమైందని, వారి మధ్య మనస్పర్థల తలెత్తడంతో రెండేళ్లగా వేర్వేరుగా ఉంటున్నారని అప్పారావు తెలిపాడు. ఇటీవల ఆనంద్ వచ్చి గ్రామపెద్దలతో చర్చించడంతో ఇద్దరూ కలసి కొలిమేరులోనే కాపురం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో నిద్రిస్తున్న మరియపై హత్యాయత్నం చేశాడన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ ఎస్సై ఎం.అశోక్ తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
RR vs SRH: చెలరేగిన నితీష్ కుమార్.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
తెలంగాణకు రేవంత్రెడ్డి శనిలా పట్టాడు: హరీష్ రావు
కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
TS: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు తేదీ పొడిగింపు
బీజేపీ కుట్రలు అడ్డుకుంటాం: సీఎం రేవంత్
విండీస్ క్రికెటర్కు బిగ్ షాకిచ్చిన ఐసీసీ.... ఐదేళ్ల పాటు నిషేధం
భర్తతో ఉన్న ఫోటోలు డిలీట్ చేయమన్న కత్రినా!
ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
ఈ బ్యూటీని గుర్తు పట్టారా? టీమిండియా స్టార్ భార్య.. రెండుసార్లు పెళ్లి! (ఫొటోలు)
తప్పక చదవండి
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
- రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- పవన్కు పోతిన మహేష్ బహిరంగ లేఖ.. ఆన్సర్ ప్లీజ్!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
Advertisement