కుటుంబం ఆత్మహత్యాయత్నం.. భర్త, పిల్లల మృతి

Family Suicide Attempt Three Died In Visakhapatnam - Sakshi

భార్య పరిస్థితి విషమం

సాక్షి, విశాఖపట్నం : జిల్లాలోని కె.కోటపాటు మండలం చంద్రయ్యపేటలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులు సహా దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో భర్త, ఇద్దరు పిల్లలు మృతి చెందగా భార్య ప్రాణాపాయ స్థితిలో ఉంది. వివరాలు.. అనంతగిరి మండలానికి దంపతులు, వారి ఇద్దరు పిల్లలు చంద్రయ్యపేటలోని ఓ కోళ్లఫారంలో గత 6 నెలలుగా పని చేస్తున్నారు. నిన్న రాత్రి (శనివారం) కోళ్లఫారం వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఘటనలో చిన్న, చింటూ, వీణలు అక్కడికక్కడే మృతి చెందగా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న భార్యను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడినుంచి విశాఖపట్నం తరలించారు. కాగా, ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగిందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్యలుగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top