సైంటిస్టుగా నమ్మించి మహిళకు బురిడీ | Delhi Based Woman Filed A Police Complaint Against Cheating Husband | Sakshi
Sakshi News home page

సైంటిస్టుగా నమ్మించి మహిళకు బురిడీ

Oct 6 2019 12:15 PM | Updated on Oct 6 2019 12:16 PM

Delhi Based Woman Filed A Police Complaint Against Cheating Husband - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

సైంటిస్ట్‌గా నమ్మబలుకుతూ మహిళను మోసం చేసి వివాహం చేసుకున్న ఆవారాపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.

న్యూఢిల్లీ : గతంలో పెళ్లై ఆవారాగా తిరిగే ప్రబుద్ధుడు తాను డీఆర్‌డీఓ సైంటిస్ట్‌నని, అవివాహితుడనని ఢిల్లీకి చెందిన ఓ మహిళను బురిడీ కొట్టించిన ఘటన దేశ రాజధానిలో వెలుగుచూసింది. తనను పెళ్లి చేసుకునేందుకు నిందితుడు ఫోర్జరీ ఐడీ కార్డులను చూపాడని తీరా పెళ్లయిన తర్వాత అతడు మోసగాడని, ఎలాంటి ఉద్యోగం​ లేదని పైగా గతంలో​నే వివాహమైందని తెలిసిందని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు జితేంద్ర సింగ్‌పై ద్వారకా నార్త్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. నిందితుడిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement