‘బిర్యానీ అమ్మాడని చితకబాదారు’ | UP Biryani Seller Abused Over His Caste Near Delhi | Sakshi
Sakshi News home page

‘బిర్యానీ అమ్మాడని చితకబాదారు’

Dec 15 2019 2:20 PM | Updated on Dec 15 2019 5:58 PM

UP Biryani Seller Abused Over His Caste Near Delhi - Sakshi

తాము పలుమార్లు వారించినా బిర్యానీ విక్రయించాడనే ఆగ్రహంతో దళితుడిపై కొందరు దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది.

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో దారుణం చోటుచేసుకుంది. దళిత వ్యక్తి  బిర్యానీ అమ్ముతున్నాడనే ఆగ్రహంతో కొందరు అతనిపై దాడి చేసి తీవ్రంగా కొట్టిన ఘటన కలకలం రేపింది. గ్రేటర్‌ నోయిడాలోని రబుపురాలో జరిగిన ఈ దాడి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. బిర్యానీ విక్రయిస్తున్న దళితుడు లోకేష్‌ (43)ను కులం పేరుతో దూషిస్తూ కొందరు భౌతిక దాడికి పాల్పడిన దృశ్యాలు ఈ వీడియోలో కనిపించాయి. శుక్రవారం ఈ ఘటన జరగ్గా వీడియో మాత్రం ఆదివారం వెలుగులోకి వచ్చింది. పలుసార్లు తాము హెచ్చరించినా అతను బిర్యానీ విక్రయిస్తున్నాడనే ఆగ్రహంతో వారు దళితుడిపై దాడికి తెగబడినట్టు స్ధానికులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కాగా ఈ ఘటనను ఖండిస్తూ నటి ఊర్మిళా మటోండ్కర్‌ ట్వీట్‌ చేశారు. భారతీయులుగా మనం అంటరానితనం పాటించడం మన సంస్కృతి కాదని, ఇది నాగరికం అనిపించుకోదని వ్యాఖ్యానించారు. దళితునిపై దాడి ఘటన సబ్‌ కా సాథ్‌..సబ్‌ కా వికాస్‌ ఉద్దేశానికి విరుద్ధమని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement