‘ఉత్తమ డ్రైవర్‌’ గా అవార్డు.. అంతలోనే విషాదం

Best Driver Award Winner Srinivas Died In Kondagattu Accident - Sakshi

సాక్షి, జగిత్యాల : కొండగట్టులో జరిగిన బస్సు ప్రమాదంలో దాదాపు 57 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ శ్రీనివాస్‌ కూడా దుర్మరణం పాలయ్యాడు. అయితే శ్రీనివాస్‌కు ఆగస్టు 15న ఉత్తమ డ్రైవర్‌గా అవార్డు దక్కింది. అయితే అంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కొడిమ్యాల మండలంలోని ఏడు గ్రామాలకు చెందిన 45 మంది ప్రాణాలు కోల్పోయారు. పెద్దపల్లి జిల్లా రాంపల్లికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top