గుజరాత్‌ కోర్టుకు ఐఎస్‌ఐ తీవ్రవాది | Asghar Ali Shifted To Gujarat In Haren Pandya Murder Case | Sakshi
Sakshi News home page

గుజరాత్‌ కోర్టుకు ఐఎస్‌ఐ తీవ్రవాది

Aug 9 2019 12:37 PM | Updated on Aug 9 2019 12:37 PM

Asghar Ali Shifted To Gujarat In Haren Pandya Murder Case - Sakshi

సాక్షి, నల్లగొండ: గుజరాత్‌ హోంమంత్రి హరెన్‌పాండ్య హత్యకేసులో, మిర్యాలగూడ ప్రణయ్‌ కేసులో నిందితుడిగా ఉన్న ఐఎస్‌ఐ తీవ్రవాది అస్గర్‌ అలీని గుజరాత్‌ హైకోర్టు ఆదేశాల మేరకు గురువారం నల్లగొండ జిల్లా పోలీసులు గుజరాత్‌కు తరలించారు. హోంమంత్రి హరెన్‌పాండ్య హత్య కేసులో అస్గర్‌ కీలక నిందితుడు. గుజరాత్‌లో కేసు నమోదు కావడంతో అక్కడి కోర్టులో విచారణ సాగుతోంది. కాగా, ప్రణయ్‌ హత్యకేసులో పీడీ యాక్ట్‌ కింద వరంగల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న అస్గర్‌ అలీ ఇటీవల విడుదలయ్యా డు.

వరంగల్‌ జైలునుంచి బయటికి వచ్చిన తర్వాత ప్రణయ్‌ హత్యకేసులో మరో నింది తుడు అబ్దుల్‌ బారీ, మారుతీరావులను కలిసి భూ సమస్య సెటిల్మెంట్‌ని, డబ్బులు డిమాండ్‌ చేసే అవకాశం ఉందని గుర్తించిన పోలీ సులు అతని కదలికలపై నిఘాఉంచారు. గంజాయి కేసులో పోలీసులకు చిక్కడంతో జిల్లా జైలుకు పంపించారు. కేసు విచారణ కొనసాగుతుండగానే అస్గర్‌అలీని గుజరాత్‌ కోర్టు జిల్లా పోలీసులను స్థానిక కోర్టులో హాజ రుపరచాలని ఆదేశించింది. దీంతో పటి ష్ట భద్రత మధ్య గుజరాత్‌కు తరలించినట్లు జి ల్లా ఇన్‌చార్జ్‌ ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.  ఎవరైనా సెటిల్‌మెంట్లు, బెదిరింపులకు పాల్పడితే సమాచారం ఇవ్వాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement