ఫిలిప్పీన్స్‌లో బాంబు పేలుళ్లు.. 19 మంది మృతి | 19 killed in Twin Explosions During Sunday Mass in Philippines church | Sakshi
Sakshi News home page

Jan 27 2019 10:26 AM | Updated on Jan 27 2019 1:57 PM

19 killed in Twin Explosions During Sunday Mass in Philippines church - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సుమారు 19 మంది మృతి చెందగా 50 మంది వరకు గాయపడ్డారని

మనీలా : వరుస బాంబు పేలుళ్లతో ఫిలిప్పిన్స్‌లోని జోలో ఐలాండ్‌ దద్దరిల్లింది. ఆదివారం దక్షిణ ఫిలిప్పిన్‌, ఐలాండ్‌లోని రోమన్‌ కాథోలిక్‌ చర్చి సమీపంలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ల ఘటనలో సుమారు 19 మంది మృతి చెందగా 50 మంది వరకు గాయపడ్డారని అధికారులు పేర్కొన్నారు. అప్రమత్తమైన పోలీసులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటన ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేసి సహాయక చర్యలు చేపట్టారు. చర్చిలోపల తొలి బాంబు పేలుడు జరగ్గా.. రెండోది కాంపౌండ్‌ బయట చోటుచేసుకుందని పోలీసులు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement