వొడాఫోన్ బంపర్ ఆఫర్: అయితే వారికే..
వొడాఫోన్ ఇండియా తన కస్టమర్లకు బుధవారం బంపర్ ఆఫర్ ప్రకటించింది. తన ప్రీపెయిడ్ కస్టమర్లకు రూ.348 ఆఫర్ను లాంచ్ చేసింది. ఈ ఆఫర్ కింద రోజుకు 1జీబీ డేటాతో పాటు 28 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్ను పొందవచ్చు. 4జీ, 3జీ, 2జీ ఎనాబుల్డ్ ప్రీపెయిడ్ కస్టమర్లందరూ ఈ అపరిమిత వాయిస్ కాలింగ్, డేటా ప్రయోజనాలను పొందవచ్చని వొడాఫోన్ పేర్కొంది. అయితే ఇది కేవలం రాజస్తాన్ రాష్ట్ర వాసులకు మాత్రమే. ఈ రూ.348 ప్రీపెయిడ్ రీఛార్జ్ ఆఫర్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని లీడింగ్ వొడాఫోన్ స్టోర్లు, మినీ స్టోర్లు, మల్టి బ్రాండు రిటైల్ అవుట్లెట్లలో అందుబాటులో ఉంటుందని కంపెనీ తన అధికారిక ప్రకటనలో తెలిపింది. మైవొడాఫోన్ యాప్ ద్వారా కూడా కస్టమర్లు ఈ రీఛార్జ్ చేపించుకోవచ్చని పేర్కొంది.
వొడాఫోన్ ఎప్పడికప్పుడు వినూత్న ప్రొడక్ట్లు, సర్వీసులతో మీ ముందుకు వస్తుందని, కస్టమర్లకు అత్యున్నతమైన విలువలు అందించడమే ఈ ఆఫర్ లక్ష్యమని రాజస్తాన్ వొడాఫోన్ ఇండియా బిజినెస్ హెడ్ అమిత్ భేడీ చెప్పారు. రూ.348 ప్రీపెయిడ్ రీఛార్జ్ ఆఫర్తో, యూజర్లు ఇంటర్నెట్కు సంబంధించిన వీడియో, లైవ్టీవీ, ఛాట్స్ వంటి వాటిని అన్వేషించవచ్చని పేర్కొన్నారు. అదనంగా తమకు ప్రియమైన వారితో దేశవ్యాప్తంగా ఏ ప్రాంతంలో ఉన్న అపరిమిత సంభాషణ జరుపవచ్చన్నారు. రిలయన్స్ జియో లాంచైన దగ్గర్నుంచి వొడాఫోన్తో పాటు మిగతా టాప్ టెలికాం ప్లేయర్స్ తమ కస్టమర్లకు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. జియోకు గట్టిపోటీ ఇవ్వడానికి, దేశంలోనే అతిపెద్ద టెలికాం ఆపరేటర్గా ఆవిర్భవించడానికి వొడాఫోన్, ఐడియా సెల్యులార్లు ఒకటిగా జతకట్టబోతున్నాయి.