మొబైల్ ఫోన్ల తయారీ కోసం టాస్క్‌ఫోర్స్ | The Task Force for Manufacture of mobile phones | Sakshi
Sakshi News home page

మొబైల్ ఫోన్ల తయారీ కోసం టాస్క్‌ఫోర్స్

Dec 30 2014 1:06 AM | Updated on Oct 9 2018 4:06 PM

మొబైల్ ఫోన్ల తయారీ కోసం టాస్క్‌ఫోర్స్ - Sakshi

మొబైల్ ఫోన్ల తయారీ కోసం టాస్క్‌ఫోర్స్

మొబైల్ ఫోన్ల తయారీ జోరు పెంచడానికి కేంద్రం ఒక సంయుక్త టాస్క్ ఫోర్స్‌..

4 ఏళ్లలో 50 కోట్ల హ్యాండ్‌సెట్ల తయారీ లక్ష్యం

న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ల తయారీ జోరు పెంచడానికి కేంద్రం ఒక సంయుక్త టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. 2019 కల్లా 50 కోట్ల మొబైల్ ఫోన్లు భారత్‌లో తయారు చేయడం (వార్షిక ఉత్పత్తిని రూ.1,50,000 కోట్ల నుంచి రూ.3,00,000కోట్లకు పెంచడం) లక్ష్యంగా ఈ ఫాస్ట్‌ట్రాక్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇంత భారీ స్థాయి ఉత్పత్తి కారణంగా 15 లక్షల మందికి ఉద్యోగవకాశాలు వస్తాయని అంచనా.

ఇండియన్ సెల్యులర్ ఆసోసియేషన్(ఐసీఏ) నేషనల్ ప్రెసిడెంట్ పంకజ్ మోహింద్రూ ఈ టాస్క్‌ఫోర్స్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. శామ్‌సంగ్, మైక్రోసాఫ్ట్ డివెసైస్, లావా, మైక్రోమ్యాక్స్,  ఎల్‌జీ, సోనీ తదితర కంపెనీల ప్రతినిధులకు కూడా ఈ టాస్క్‌ఫోర్స్‌లో స్థానం కల్పించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(డైటీ) డెరైక్టర్లు ఎస్‌కె. మార్వా, ఆశా నంగియాలు టాస్క్ ఫోర్స్ లో ప్రభుత్వ ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. ఈ ఏడాది భారత మొబైల్ మార్కెట్ 32 శాతం వృద్ధితో 1,200 కోట్ల డాలర్లకు పెరుగుతుందని,  దీంట్లో దిగుమతుల వాటా మూడొంతులని అంచనా. నోకియా ప్లాంట్ మూసివేత కారణంగా దేశీయంగా మొబైల్ ఫోన్‌ల తయారీ 29 శాతం క్షీణించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement