వరుస లాభాలకు బ్రేక్
ముంబై : స్టాక్ మార్కెట్లలో వరుస లాభాలకు బుధవారం బ్రేక్ పడింది. గ్లోబల్ మార్కెట్ల బలహీన ట్రెండ్తో పాటు బ్యాంక్, ఫైనాన్షియల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 193 పాయింట్ల నష్టంతో 39,756 పాయింట్ల వద్ద క్లోజవగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 59 పాయింట్ల నష్టంతో 11,906 పాయింట్ల వద్ద ముగిసింది. టాటా స్టీల్, ఓఎన్జీసీ లాభపడగా, యస్బ్యాంక్, మారుతి సుజుకి తదితర షేర్లు నష్టపోయాయి. స్టాక్ మార్కెట్లలో మరికొద్ది రోజులు ఊగిసలాట ధోరణి కొనసాగుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని వార్తలు