రూపాయి 65 పైసలు పతనం | Rupee slides 65 paise against USD to 73.99 on growth concerns     | Sakshi
Sakshi News home page

రూపాయి 65 పైసలు పతనం

Mar 6 2020 10:33 AM | Updated on Mar 6 2020 10:48 AM

Rupee slides 65 paise against USD to 73.99 on growth concerns     - Sakshi

సాక్షి,ముంబై: ప్రపంచ వృద్ధి ఆందోళనల నేపథ్యంలో అటు డాలరు, ఇటు  రూపాయి భారీగా  నష్టపోతున్నాయి. కోవిడ్‌-19 భయాలకు తోడు, దేశీయంగా ప్రైవేటు బ్యాంకు యస్‌ బ్యాంకుపై ఆర్‌బీఐ విధించిన  ఆంక్షలు, అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ అనూహ్య వడ్డీరేటు కోత నిర్ణయం కరెన్సీ  ట్రేడింగ్‌ను ప్రభావితం చేస్తున్నాయి.  మరోవైపు కరోనావైరస్ వ్యాప్తి వృద్ధిని తాకవచ్చన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  వ్యాఖ్యల డాలర్ సూచీ స్పాట్ మార్కెట్లలో 0.25 శాతం క్షీణించింది. దీంతో రూపాయి డాలరుమారకంలో శుక్రవారం ఏకంగా 65 పైసలు క్షీణించింది. 73.99 ట్రేడింగ్‌ను ఆరంభించి  74.06 కనిష్టానికి చేరింది. గురువారం డాలర్‌తో పోలిస్తే 73.33 వద్ద 6 పైసల లాభాలతో రూపాయి ముగిసింది. మూలధన మార్కెట్ల నుండి ఫారెక్స్ ప్రవాహం కొనసాగుతుండటం భారతీయ కరెన్సీని తాకిందని వ్యాపారులు తెలిపారు. అటు దేశీయ స్టాక్‌మార్కెట్లుభారీగా కుప్పకూలాయి.  సెన్సెక్స్‌ 1400 పాయింట్లకుపై పతనం కాగా, నిఫ్టీ 400 పాయింట్లు నష్టపోయింది.

ఆల్‌ టైం గరిష్టానికి బంగారం ధర
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పిఐ) గురువారం నికర ప్రాతిపదికన రూ .2,476.75 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించినట్లు మార్కెట్ డేటా ద్వారా తెలుస్తోంది. చమురు ధరలు 1.06 శాతం తగ్గాయి. దీంతో బంగారం ధరలు  వరుసగా లాభపడుతూ శుక్రవారం ఆల్‌టైం గరిష్టానికి చేరాయి. బంగారు ఫ్యూచర్స్  మార్కెట్‌లో 10 గ్రాముకు రూ. 200 పెరిగి 44,640 వద్ద కొత్త గరిష్టానికి తాకింది. 

చదవండి : బ్లాక్‌ ఫ్రైడే; సెన్సెక్స్‌1500 పాయింట్లు క్రాష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement