హువాయ్‌తో రిలయన్స్ జియో ఒప్పందం | Reliance Jio signs pact with Huawei for 4G devices | Sakshi
Sakshi News home page

హువాయ్‌తో రిలయన్స్ జియో ఒప్పందం

May 19 2015 1:20 AM | Updated on Sep 3 2017 2:17 AM

హువాయ్‌తో రిలయన్స్ జియో ఒప్పందం

హువాయ్‌తో రిలయన్స్ జియో ఒప్పందం

4జీ స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు తదితర పరికరాల విషయమై రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన...

న్యూఢిల్లీ: 4జీ స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు తదితర పరికరాల విషయమై రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన టెలికం విభాగం రిలయన్స్ జియోకామ్, చైనాకు చెందిన హువాయ్ కంపెనీతో  ఒప్పందం కుదుర్చుకుంది. రిలయన్స్ జియో ఈ ఏడాది 5 వేల పట్టణాల్లో, 2 లక్షలకుపైగా గ్రామాల్లో 4జీ సేవలను ప్రారంభించడానికి ప్రణాళికలు రచిస్తోంది. ఈ కంపెనీ 4జీ స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఇతర  పరికరాలను రిలయన్స్ జియోకు ఎప్పటి నుంచి సరఫరా చేసే అంశంపై (భారత్‌కు దిగుమతి చేసే అంశం) ఇంకా స్పష్టత రాలేదు.

ఈ ఒప్పందంపై అటు రిలయన్స్ జియో కానీ, ఇటు హువాయ్ కంపెనీ కానీ స్పందించలేదు. ప్రముఖ మొబైల్ హ్యాండ్‌సెట్ల తయారీ కంపెనీలతో క్రియాశీలకంగా కలిసి పనిచేస్తామని రిలయన్స్ జియో ఇదివరకే ప్రకటించింది. రిలయన్స్ జియో ఈ మధ్యనే శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్, ఏస్ టెక్నాలజీస్ కార్ప్ నుంచి పలు వస్తు సేవలను పొంద డం కోసం దాదాపు రూ.4,500 కోట్ల నిధులను సేకరించింది. ఏస్ టెక్నాలజీస్ కార్ప్ టెలికం సంబంధిత పరికరాలను, ఇతర సామాగ్రిని రిలయన్స్ జియోకి సరఫరా చేయనుంది.

Advertisement
 
Advertisement
Advertisement