జియో రిపబ్లిక్‌ డే : ఆఫర్లివే | Reliance Jio plans revised again for Republic Day | Sakshi
Sakshi News home page

జియో రిపబ్లిక్‌ డే : ఆఫర్లివే

Jan 23 2018 5:54 PM | Updated on Jan 23 2018 8:21 PM

Reliance Jio plans revised again for Republic Day - Sakshi

రిలయన్స్‌ జియో మరోసారి తన ప్లాన్లను అప్‌గ్రేడ్‌ చేసింది. రిపబ్లిక్‌ డే సందర్భంగా జియో తన ప్లాన్లను అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాక కొత్త ప్లాన్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. రిపబ్లిక్‌ డే సందర్భంగా 98 రూపాయలతో కొత్త ప్యాక్‌ను జియో ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్యాక్‌పై అపరిమిత కాలింగ్‌ను, 2జీబీ డేటాను 28 రోజుల పాటు అందించనున్నట్టు ప్రకటించింది. అంతేకాక సమీక్షించిన ప్లాన్లపై రోజుకు 1జీబీ డేటా బదులు 1.5జీబీ డేటాను, 1.5జీబీ డేటా ప్యాక్స్‌పై 2జీబీ డేటాను ఆఫర్‌ చేయనున్నట్టు తెలిపింది. 

దీంతో రూ. 149, రూ.349, రూ.399, రూ.449 ప్యాక్‌లపై 42జీబీ, 105జీబీ, 126జీబీ, 136జీబీ డేటాను... 28 రోజులు, 70 రోజులు, 84 రోజులు, 91 రోజుల పాటు లభించనుంది. ఈ ప్యాక్‌లపై అంతకముందు రోజుకు 1జీబీ డేటానే ఉండేది. ప్రస్తుతం 1.5జీబీ డేటాను జియో ఆఫర్‌ చేయనుంది. అంతేకాక 1.5జీబీ డేటా ప్యాక్‌లైన రూ.198, రూ.398, రూ.448, రూ.498 ప్యాక్‌లపై రోజుకు 2జీబీ చొప్పున 56జీబీ, 140జీబీ, 168జీబీ, 182జీబీ డేటా లభించనుంది. రిపబ్లిక్‌ డే నుంచి ఈ ప్లాన్లు అందుబాటులోకి రానున్నాయి.  అంటే మొత్తంగా సమీక్షించిన అన్ని ప్యాక్‌లపై 50 శాతం ఎక్కువ డేటా లభించనుంది.
 

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement