సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తి రంగానికి మళ్లీ గడ్డుకాలం వచ్చింది. ఆర్థిక మాంద్యం, స్థానిక రాజకీయాంశం వంటి ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న నిర్మాణరంగాన్ని ఇప్పుడు రాజకీయ అనిశ్చితి, ఎన్నికలు, కనికరించని బ్యాంకులు చుట్టుముట్టాయి. దీంతో తెలంగాణ, సీమాంధ్ర రెండు రాష్ట్రాల్లోనూ స్థిరాస్తి వ్యాపారం మందగించింది. దీంతో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయానికి భారీగానే గండి పడింది. రాష్ర్ట వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయాన్ని ఒకసారి పరిశీలిస్తే.. గతేడాది రూ.6,588.51 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా, ఈ ఏడాది రూ.5,034.30 కోట్లను గడించింది. అంటే 23.59 శాతం తక్కువ ఆదాయాన్ని ఆర్జించిందని రిజిస్ట్రేషన్ శాఖ గణాంకాలే చెబుతున్నాయి.
ప్రత్యేక రాష్ట్ర ప్రకటన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో భూములు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లను ప్రభావితం చేయగా, ఆర్థిక లోటు, రాజధాని ప్రకటనపై నెలకొన్న అనిశ్చితి సీమాంధ్రలో స్థిరాస్తి వ్యాపారంపై ప్రభావం చూపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. పెపైచ్చు ఎన్నికల ప్రభావమూ ఉండనే ఉంటుందని చెబుతున్నారు. తెలంగాణ ప్రకటన వచ్చాక ఫ్లాట్ల కొనుగోళ్లు భారీగా పడిపోయాయని శాంతాశ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ నర్సయ్య ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు.
మార్చి నెలలో మా సంస్థలో కేవలం 16 బుకింగ్స్తో రూ. 12 కోట్ల వ్యాపారాన్ని మాత్రమే చేసిందని పేర్కొన్నారు. నగరీకరణ శరవేగంగా జరుగుతుండటంతో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల్లో ఏడాదిన్నరగా ఇబ్బడిముబ్బడిగా వెంచర్లు వెలిశాయి. అదే క్రమంలో బడా కంపెనీలు కూడా రాష్ట్రానికి తరలిరావడంతో శివార్లలో కూడా బడా అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు పుట్టుకొచ్చాయి. దీంతో గతేడాది జూలై రెండోవారం వరకు కూడా రిజిస్ట్రేషన్లు జోరుగానే సాగాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో మందగించాయని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు.
రిజిస్ట్రేషన్ శాఖ గణాంకాలివే..
రియల్ ఎస్టేట్ వ్యాపారమంటే గుర్తొచ్చేవి హైదరాబాద్, రంగారెడ్డి, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాలే. గతేడాదితో పోలిస్తే ఈ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం గణనీయంగా పడిపోయింది.
గతేడాది కంటే ఈ ఏడాది హైదరాబాద్లో 30.54 శాతం, హైదరాబాద్ దక్షిణంలో 6.33 శాతం అదేవిధంగా రంగారెడ్డిలో 21.24 శాతం, రంగారెడ్డి తూర్పులో 27.45 శాతం ఆదాయం తక్కువ వచ్చింది.
ఇక సీమాంధ్ర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గతేడాదితో పోలిస్తే విశాఖపట్నంలో 26.03 శాతం, విజయవాడలో 23.39 శాతం, విజయవాడ తూర్పులో 27.33 శాతం అదేవిధంగా చిత్తూరులో 26.26 శాతం ఆదాయం తక్కువగా వచ్చింది.
జోరు తగ్గింది!
Published Sat, Apr 5 2014 1:49 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement