ప్రభుత్వ రంగ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ (ఆర్సీఎఫ్) సంస్థ ఈ యేడాది చివరి నాటికి నవరత్న హోదా పొందే అవకాశం ఉంది.
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ (ఆర్సీఎఫ్) సంస్థ ఈ యేడాది చివరి నాటికి నవరత్న హోదా పొందే అవకాశం ఉంది. సంస్థ 37వ వార్షిక సమావేశంలో చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ ఆర్జీ రాజన్ ఈ విషయాన్ని తెలిపారు. ఈ హోదాను పొందడం వల్ల ఆర్థికంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో ఆర్సీఎఫ్కు కొంత సౌలభ్యత ఏర్పడుతుంది. ప్రస్తుతం ప్రభుత్వ రంగంలోని 17 సంస్థలు ఈ హోదాను కలిగి ఉన్నాయి.