1500 కు పైగా లిస్టెడ్ కంపెనీలకు షాక్ | Over 1,500 companies fined for not appointing woman directors | Sakshi
Sakshi News home page

1500 కు పైగా లిస్టెడ్ కంపెనీలకు షాక్

May 7 2016 10:37 AM | Updated on Oct 2 2018 4:26 PM

1500 కు పైగా  లిస్టెడ్ కంపెనీలకు షాక్ - Sakshi

1500 కు పైగా లిస్టెడ్ కంపెనీలకు షాక్

సెబీ నిబంధనను బేఖాతరు చేసిన సుమారు1500 (బీఎస్సీలో 1375, ఎన్ఎస్సీలో 191) కంపెనీలపై జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేయనుంది.

న్యూఢిల్లీ: దేశీయ కంపెనీల బోర్డుల్లో ఓ మహిళా డైరెక్టర్‌ ను తప్పనిసరిగా నియమించుకోవాలంటూ సెబీ పదే పదే హెచ్చరిస్తున్నా పట్టించుకోని కంపెనీలపై  కొరడా ఝళిపించేందుకు రంగం  సిద్దమైంది.   సెబీ నిబంధనను   బేఖాతరు చేసిన  సుమారు1500  (బీఎస్సీలో 1375, ఎన్ఎస్సీలో 191)  కంపెనీలపై  జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేయనుంది. వీటిలో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, 22 ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు ఉండడం విశేషం.

మార్చి 31 నాటికి, బీఎస్సీలోని 5,451 కంపెనీలకు గాను 1,375   సంస్థలు సెబీ నిబంధనను పాటించడంలో విఫలమయ్యాయని స్టేట్ ఫినాన్స్  మినిస్టర్ జయంత్ సిన్హా  లోక్ సభ్ లో ఒక లిఖిత పూర్వక సమాధానంలో   తెలిపారు.బీఎస్సీలో 1375 కంపెనీలలో 201 మాత్రమే యాక్టివ్ గా ఉన్నాయని మిగిలిన 1,179 లను కంపెనీలను  సస్పెండ్ చేసినట్టు ప్రకటించారు. అలాగే సెబీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న  ఎన్ఎస్ఈ నుంచి 191 కంపెనీల్లో 42  యాక్టివ్ గా ఉండగా మిగిలిన 149  సంస్థలను  సస్సెండ్ చేశామన్నారు.   ఈ నాన్ - కంప్లైంట్  సంస్థలపై జరిమానా విధించనున్నట్టు తెలిపారు.

 గత రెండేళ్లుగా గడువు కాలాన్ని  పొడిగించుకుంటూ వచ్చిన సెబీ   ఈ మార్చి 31 వరకు చివరి గడువుగా పేర్కొంది.  గడువు ముగిసినా  సదరు  నియామకంలో కంపెనీలు  వైఫల్యం చెందడంతో ఈనిర్ణయం తీసుకుంది.  కనిష్టంగా రూ.50,000 జరిమానా, తరువాత నాలుగు దశల వారీగా జరిమానా పెరుగుతూ ఉంటుందని స్పష్టం చేసింది. అంతేకాదు కంపెనీల ప్రమోటర్లు, డైరెక్టర్లపై తదుపరి చర్యలు తీసుకుంటామని ఇటీవల సెబీ తెలిపింది. వీటిని కంపెనీలు బేఖాతరు చేయడంతో  కొంత గడువు విధించి, ఆ గడువు లోప తమ ఆదేశాలను అమలు చేయని కంపెనీలపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. అయినా ఫలితం కనిపించకపోవడంతో సెబీ సీరియస్ గా స్పందించింది.

సెబి నిబంధనల ప్రకారం  నియమాల ప్రకారం  మహిళ ఎగ్జిక్యూటివ్ ,లేదా నాన్ ఎగ్జిక్యూటివ్ లేదా ఇండిపెండెంట్, లేదా నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్లను గానీ మహిళా డైరెక్టర్లు నియమించుకోవచ్చన్నారు.  సదరు డైరెక్టర్లు కచ్చితంగా  ప్రమోటర్ల బంధువులై ఉండాలన్న  కచ్చితమైన నిబంధన ఏదీ విధించలేదని జయంత్ సిస్హా స్పష్టం చేశారు.


మార్కెట్  రెగ్యులేటరీ సెబీ ..2013 కంపెనీల చట్టం  ప్రకారం   అయా లిస్టెడ్ సంస్థలు తమ  బోర్డులో కనీసం ఒక మహిళా డైరెక్టర్  ఉండేలా చూడాలని  నిబంధన విధించింది. మహిళా సాధికారత, లింగ వివక్షను  రూపుమాపేందుకు ఈ   మార్గదర్శకాలను  రూపొందించినట్టుతెలిపారు. దీన్ని   కచ్చితంగా అమలుచేయాలని కఠిన ఆదేశాలు జారీ చేసింది.  లేనిపక్షంలో ఆయా కంపెనీలపై జరిమానా విధిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement