రూ 100 కోట్లు ఆర్జించింది ఒక్కడేనట | Only one Indian with over Rs 100 crore taxable income | Sakshi
Sakshi News home page

రూ 100 కోట్లు ఆర్జించింది ఒక్కడేనట

Dec 21 2017 10:57 AM | Updated on Dec 21 2017 11:07 AM

Only one Indian with over Rs 100 crore taxable income - Sakshi



సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయ పన్ను శాఖ వెల్లడించిన భారతీయులు దాఖలు చేసిన 2014-15 ఐటీ రిటన్‌ల వివరాల్లో పలు ఆశ్చర్యకర అంశాలు వెలుగుచూశాయి. రూ వంద కోట్ల పైగా పన్ను చెల్లించే రాబడి ఆర్జించినట్టు కేవలం ఒకే ఒక భారతీయుడు వెల్లడించినట్టు సమాచారం.

మొత్తం 4.1 కోట్ల మంది ఐటీ రిటన్‌లు దాఖలు చేయగా వారిలో రెం‍డు కోట్ల మంది తమకు పన్ను వేసే రాబడి అసలేమీ లేదని వెల్లడించారు. మిగిలిన రెండు కోట్ల మంది సగటున రూ 42,456 మేర ఆదాయ పన్ను చెల్లించారు. కేవలం కోటి మంది పన్ను చెల్లింపుదారులు రూ లక్షకు మించి ఆదాయ పన్ను చెల్లించారు.రూ కోటి పైన పన్ను చెల్లించదగిన రాబడిని వెల్లడించిన వారు పదివేల మందికి లోపే ఉన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement