• పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీపై ఎస్అండ్పీ విశ్లేషణ
• అసంఘటిత, గ్రామీణ, నగదు ఆధారిత విభాగాలకు నష్టం
• సావరిన్ రేటింగ్ మాత్రం తగ్గకపోవచ్చు
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతోపాటు, 2017 సెప్టెంబర్ నుంచీ అమల్లోకి వస్తుందని భావిస్తున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ)– తక్షణం అసంఘటిత, గ్రామీణ, అలాగే ఆభరణాలు, రియల్టీ వంటి నగదు ఆధారిత విభాగాలపై ‘తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని’’ చూపించనున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ సంస్థ– స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) తెలిపింది. పెద్ద నోట్ల రద్దుతో విస్తృత ప్రాతిపదికన డిమాండ్ తగ్గడం.... ఈ ప్రభావం వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా కొన్ని నెలలు కొనసాగే అవకాశం ఉందని, ఈ పరిస్థితుల్లో అమలయ్యే జీఎస్టీ వల్ల పన్నుల భారం పెరిగి ఆర్థిక వ్యవస్థకు తీవ్ర విఘాతం కలిగించవచ్చని తాజా నివేదికలో అది విశ్లేషించింది. ‘‘భారత్లో పెద్ద నోట్ల రద్దు– జీఎస్టీ: స్వల్పకాలిక కష్టం– దీర్ఘకాలిక లాభం’’ అన్న పేరుతో ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ క్రెడిట్ విశ్లేషకుడు అభిశేక్ దాంగ్రా ఒక వ్యాసం రాశారు.
దాన్లో పేర్కొన్న వివరాలను చూస్తే...
⇔ పెద్ద నోట్ల ప్రభావంతో రుణ మంజూరీలకు సంబంధించి అటు కార్పొరేట్లు, ఇటు బ్యాంకులు స్వల్పకాలంలో ఇబ్బందులను ఎదుర్కొంటాయి. ఇది జీడీపీ వృద్ధితీరు తగ్గుదలకూ దారితీయవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును సంస్థ 7 శాతం నుంచి ఇప్పటికే 6.9 శాతానికి తగ్గించింది.
⇔ భారత ప్రభుత్వ సంస్కరణలు దీర్ఘకాలికంగా వ్యవస్థాగత ప్రయోజనాలను అందించేవే. అయితే స్వల్పకాలికంగా నిర్వహణ, సర్దుబాట్ల ఇబ్బందులు ఉంటాయి.
⇔ 2017 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు వినియోగం పడిపోతుందని మేము భావిస్తున్నాం. అయితే 2018 ఆర్థిక సంవత్సరంలో తిరిగి వృద్ధి ఊపందుకునే వీలుంది. దీర్ఘకాలికంగా చూస్తే...వృద్ధి తిరిగి 8 శాతం జోన్లోకి ప్రవేశించే అవకాశమూ ఉంది.
నోట్ల రద్దు సమస్య స్వల్పకాలమే: నొమురా
భారత్లో నోట్ల రద్దు ప్రభావం స్వల్పకాలమే ఉంటుందని జపాన్ బ్రోకరేజ్ సంస్థ– నొమురా అంచనా వేసింది. దీర్ఢకాలంలో భారత్ వృద్ధి తీరుకు భరోసాను ఇచ్చింది. వచ్చే 12 నెలల కాలం చూస్తే... వృద్ధి విషయంలో పెద్దగా మార్పేమీ ఉండదని పేర్కొంది. 2016, 17లో వృద్ధిరేటు 7.1 శాతంగా ఉంటుందని, 2018లో ఇది 7.7 శాతానికి చేరుతుందని వివరించింది.
ఎప్పటికో లాభమైనా... ఇప్పటికి నష్టమే!
Published Thu, Dec 15 2016 12:44 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గైటీ థియేటర్ ప్రత్యేకత ఏమిటి? బ్రిటీషర్లు ఎందుకు నిర్మించారు?
గ్యారంటీలు అమలైతే ఓట్లడగం! : మాజీ మంత్రి హరీశ్రావు
గంపగుత్తగా రాబట్టాలని..
No Headline
ఫలానా వారి కుమార్తెలు 30 లక్షల మంది
నూర్ బాషా కులాన్ని గుర్తించింది సీఎం జగనే
Watch Live: కోరుకొండలో సీఎం జగన్ ప్రచార సభ
నియోజకవర్గంలో జూన్ 2019 నుంచి జూన్ 2023 వరకూ వివిధ పథకాలతో లబ్ధి
రాజకీయ అపర చాణక్యుడు సుబ్బరాజు
మెట్ట రాజకీయానికి కేంద్రం జగ్గంపేట
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement