జపనీస్ ఆటో దిగ్గజం నిస్సాన్ కొత్తగా ఒక లీటరు ఇంజిన్తో డాట్సన్ రెడీ-గో కారును మార్కెట్లోకి లాంచ్ చేసింది.

న్యూఢిల్లీ : జపనీస్ ఆటో దిగ్గజం నిస్సాన్ కొత్తగా ఒక లీటరు ఇంజిన్తో డాట్సన్ రెడీ-గో కారును మార్కెట్లోకి లాంచ్ చేసింది. దీని ధర ఎక్స్షోరూం ఢిల్లీలో రూ.3.57 లక్షలుగా నిస్సాన్ తెలిపింది. ఈ కొత్త వాహనం లీటరుకు 22.5 కిలోమీటర్లు వరకు ప్రయాణించే ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని పేర్కొంది. ఈ కారు టాప్-వేరియంట్ మోడల్ ధర రూ.3.72 లక్షలుగా ఉంది. గతేడాది విజయవంతంగా లాంచ్ చేసిన రెడీ-గోలో ప్రస్తుతం తీసుకొచ్చిన 1.0 లీటర్ ఇంజిన్ వేరియంట్ అత్యంత శక్తివంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందించనున్నట్టు నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ మల్హోత్రా చెప్పారు.