పసిడిపై రుణం రూ.25,000 దాటితే చెక్కే ఇవ్వాలి | NBFC cash loan against gold restricted to Rs 25000: RBI | Sakshi
Sakshi News home page

పసిడిపై రుణం రూ.25,000 దాటితే చెక్కే ఇవ్వాలి

Mar 10 2017 1:11 AM | Updated on Sep 5 2017 5:38 AM

పసిడిపై రుణం రూ.25,000 దాటితే చెక్కే ఇవ్వాలి

పసిడిపై రుణం రూ.25,000 దాటితే చెక్కే ఇవ్వాలి

పసిడి ఆభరణాలపై రుణాలకు సంబంధించి నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు (ఎన్‌బీఎఫ్‌సీ) గురువారం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలకు ఆర్‌బీఐ ఆదేశాలు
ఇప్పటి వరకూ రూ.లక్షగా ఉన్న పరిమితి


ముంబై: పసిడి ఆభరణాలపై రుణాలకు సంబంధించి నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు (ఎన్‌బీఎఫ్‌సీ) గురువారం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. రుణం రూ.25,000 దాటితే చెక్కురూపంలోనే మంజూరు చేయాలన్నది ఈ ఆదేశాల సారాంశం.  అంటే ఇకపై పసిడి తనఖాలపై రుణం రూ.25,000 వరకే నగదు రూపంలో ఎన్‌బీఎఫ్‌సీల వద్ద లభిస్తాయన్నమాట. ఇంతక్రితం ఈ పరిమితి రూ.లక్షగా ఉండేది.

ఆదాయపు పన్ను చట్టం నిబంధనలను అనుసరించి ఆర్‌బీఐ తాజా నిర్ణయం తీసుకుంది.  ఆర్థిక లావాదేవీలు అన్నీ నగదు రహితంగా జరగాలని కోరుకుంటున్నట్లు ప్రభుత్వం నుంచి పదేపదే వెలువడుతున్న ప్రకటనల నేపథ్యంలో తాజా ప్రకటన వెలువడింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహానికి పలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement