మహీంద్రాకు మందగమనం సెగ | Mahindra & Mahindra Net Profit Fell 78 Percent to Rs 368 crore | Sakshi
Sakshi News home page

మహీంద్రాకు మందగమనం సెగ

Nov 9 2019 6:30 AM | Updated on Nov 9 2019 6:30 AM

 Mahindra & Mahindra Net Profit Fell 78 Percent to Rs 368 crore - Sakshi

ముంబై: మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీ నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసిక కాలంలో 78 శాతం తగ్గి రూ.368 కోట్లకు చేరింది. అమ్మకాలు బాగా పడిపోవడంతో నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని మహీంద్రా అండ్‌ మహీంద్రా తెలిపింది. ఆదాయం 6 శాతం తగ్గి రూ.23,936 కోట్లకు తగ్గిందని పేర్కొంది. మార్కెట్‌ అంచనాలకు అందని విధంగా ఉన్నందున అమ్మకాలు, ఆదాయ అంచనాలను వెల్లడించడం లేదని కంపెనీ ఎమ్‌డీ పవన్‌ గోయెంకా వ్యాఖ్యానించారు. అక్టోబర్‌లో మాత్రం అమ్మకాలు పుంజుకున్నాయని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement